విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గురువారం (జనవరి 26న) ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.. దీంతో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు విజయవాడ సీపీ రాణా తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. గురువారం నగరంలోని బెంజిసర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు, రెడ్సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. నగరవాసులు ఈ ట్రాఫిక్ ఆంక్షల్ని గమనించి తమకు సహకరించాలని పోలీసులు సూచించారు. తాము సూచించిన ఆయా మార్గాల్లో వెళ్లాలని తెలిపారు.
విజయవాడ ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు.. ఏలూరు రోడ్డు, సిద్ధార్థ జంక్షన్ మార్గాన బందరు లాకులు, అమెరికన్ ఆస్పత్రి, స్క్యూ బ్రిడ్జి మార్గంలో వెళ్లాలన్నారు. ఐదో నంబర్ రూట్లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్ మార్గంలో ప్రయాణించాలన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు రాకపోకలు సాగించే వాహనాలు ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్జంక్షన్ మార్గంలో వెళ్లాలన్నారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, అవనిగడ్డ, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో వెళ్లాలని సూచించారు. గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మార్గం సూచించారు. అలాగే రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చే వాహనాల పార్కింగ్కు సంబంధించి కీలక సూచనలు చేశారు.
విజయవాడ ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు.. ఏలూరు రోడ్డు, సిద్ధార్థ జంక్షన్ మార్గాన బందరు లాకులు, అమెరికన్ ఆస్పత్రి, స్క్యూ బ్రిడ్జి మార్గంలో వెళ్లాలన్నారు. ఐదో నంబర్ రూట్లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్ మార్గంలో ప్రయాణించాలన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు రాకపోకలు సాగించే వాహనాలు ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్జంక్షన్ మార్గంలో వెళ్లాలన్నారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, అవనిగడ్డ, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో వెళ్లాలని సూచించారు. గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మార్గం సూచించారు. అలాగే రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చే వాహనాల పార్కింగ్కు సంబంధించి కీలక సూచనలు చేశారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News