విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలను కొందరు పోస్టు చేయడంతో భక్తులు మండిపడ్డారు. ఈ విషయాన్ని కొందరు దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించగా.. అధికారులు ఆలయంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే శాంతకుమారి అనే భక్తురాలు అంతరాలయంలోని అమ్మవారిని వీడియో తీసి.. ఇన్స్టాలో పోస్టుచేసినట్లు గుర్తించారు. శాంతకుమారి గతేడాది డిసెంబరు 22న ఉదయం 9.52 నిమిషాలకు మొబైల్లో చిత్రీకరించినట్లు తేల్చారు. ఈ ఘటనతో దుర్గగుడి భద్రతాసిబ్బందికి ఈవో నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ వీడియో తీసిన శాంతకుమారిపై విజయవాడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం, వీడియో తీస్తున్నా భద్రతాసిబ్బంది గుర్తించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారి సన్నిధిలోకి మొబైల్ అనుమతి లేకపోయినా వీడియో రికార్డు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీఎఫ్ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమేరాల నిఘా ఉన్నా వీడియా రికార్డు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకునేందుకు ఓ సినీ నటుడు వచ్చారు. ఆ సమయంలో కొందరు ఫ్యాన్స్ అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిల్చుని మరీ మొబైల్లో దృశ్యాలను రికార్డ్ చేశారని చెబుతున్నారు.
విజయవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు సోషల్ మీడియాలో బయటపడటం చర్చనీయాంశమైంది. ఈ వీడియోల్లో ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు కూడా కనిపించాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్ననారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అమ్మవారి సన్నిధిలోకి మొబైల్ అనుమతి లేకపోయినా వీడియో రికార్డు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీఎఫ్ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమేరాల నిఘా ఉన్నా వీడియా రికార్డు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకునేందుకు ఓ సినీ నటుడు వచ్చారు. ఆ సమయంలో కొందరు ఫ్యాన్స్ అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిల్చుని మరీ మొబైల్లో దృశ్యాలను రికార్డ్ చేశారని చెబుతున్నారు.
విజయవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు సోషల్ మీడియాలో బయటపడటం చర్చనీయాంశమైంది. ఈ వీడియోల్లో ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు కూడా కనిపించాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్ననారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News