యాప్నగరం

ఇంద్రకీలాద్రిపై ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. స్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు.. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా దర్శించుకున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Sep 2022, 11:20 am

ప్రధానాంశాలు:

  • ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
  • తొలి రోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Swarna Kavachalankrita Durgamma
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిచారు. స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ ఆయుధాలు ధరించారు.
అమ్మవారు సకల శత్రుబాధలనూ నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై.. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది. అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పచ్చని పూలతో పూజిస్తారు. దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పారాయణం చేస్తారు. దుర్గమ్మకు కట్టె పొంగలి, చలిమిడి వడపప్పును, పాయసమును నైవేద్యంగా సమర్పిస్తారు.

మరోవైపు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమన్నారు గవర్నర్. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాను అన్నారు. నేటి నుంచి 10 రోజులపాటు రోజుకో అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. వినాయక గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు క్యూలైన్ ఉంది. సర్వదర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.