యాప్నగరం

ఆరేళ్ల బాలుడికి లైంగిక వేధింపులు.. పోక్సో కోర్టు కీలక తీర్పు

ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి లైంగిక చర్యలకు పాల్పడ్డ కేసులో నేరం రుజువు కావడంతో విజయవాడ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి చనిపోయే వరకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 10 Aug 2022, 8:30 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ఆరేళ్ల బాలుడిపై లైంగిక చర్యలకు పాల్పడ్డ ఓ నీచుడికి శిక్షను ఖరారు చేస్తు విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొండపల్లిలో ఆరేళ్ల బాలుడిపై లైంగిక చర్యలకు పాల్పడ్డ తిరుపతిరావుకు అనే వ్యక్తికి.. మరణించే వరకూ జీవిత ఖైదు శిక్ష విధించింది. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు.

ఆరేళ్ల బాలుడిపై తిరుపతిరావు అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ జరిపిన విజయవాడ పోక్సో కోర్టు.. తుది తీర్పు వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ జీవీ నారాయణరెడ్డి ఈ కేసులో మొత్తం 23 మంది సాక్షులను విచారించారు.

ఇరువర్గాల వాదనల విన్న అనంతరం పోక్సో కోర్టు సంచాలన తీర్పు వెలువరించింది. తిరుపతిరావు చనిపోయే వరకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.