యాప్నగరం

ఏపీలో పక్కాగా నైట్ కర్ఫ్యూ అమలు, నిర్మానుష్యంగా రోడ్లు.. అనవసరంగా రావొద్దు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. జనవరి 18 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున..

Samayam Telugu 19 Jan 2022, 12:54 pm
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. జనవరి 18 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు పోలీసులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు మినహాయింపు ఇచ్చారు.
Samayam Telugu విజయవాడలో నైట్ కర్ఫ్యూ


విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో విజయవాడ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. రాత్రి పూట అనవసరంగా బయటకు వచ్చే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నైట్ కర్ఫ్యూ ప్రభావంతో సినిమా థియేటర్లలో సెకండ్ షోను రద్దు చేశారు.


పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తుండగా.. రాత్రి సమయంలో విజయవాడ వీధులు నిర్మానుష్యంగా మారాయి. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని.. అలా వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.