యాప్నగరం

వామ్మో వాలంటీర్!! ఇంటిపై దౌర్జన్యం.. కత్తితో వీరంగం

ప్రభుత్వ సదుద్దేశాన్ని కొందరు వాలంటీర్లు తుంగలో తొక్కుతున్నారు. ప్రజలకు సేవలందించాల్సింది పోయి వారిపైనే తిరగబడుతున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు.

Samayam Telugu 16 Jan 2021, 3:55 pm
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొందరు బజారుకీడుస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో ప్రజలపై దాడులకు దిగుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు మరువక ముందే ఓ వాలంటీర్ ఏకంగా కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. తనను తిడుతున్నారంటూ తల్లీకొడుకులపై కత్తితో దాడి చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. అది కూడా సీఎం నివాసానికి కూతవేటు దూరంలో కావడం గమనార్హం.
Samayam Telugu గాయాలైన తల్లీకొడుకులు, దాడి చేసిన వాలంటీర్
volunteer knife attack


తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డులో నివాసముంటున్న తల్లీకొడుకులు సాలమ్మ, మహేష్ మధ్య వివాదం తలెత్తింది. ఇంటి విషయమై వారిద్దరూ గొడవ పడుతుండగా అక్కడే ఉన్న వాలంటీర్ రాజు తలదూర్చాడు. ఇద్దరూ తిట్టుకుంటుండగా మధ్యలో వెళ్లి తననే తిడుతున్నారంటూ దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఆగకుండా కత్తితో వీరంగం సృష్టించాడు. తల్లీకొడుకులపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు.తీవ్రగాయాలతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లీకొడుకులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన పోలీసులు.. వాలంటీర్ రాజుపై కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల తాడేపల్లిలో వాలంటీర్ల అరాచకాలు పెరిగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లిక్కర్ అమ్మకాల మొదలుపెట్టి.. పేకాట, పలువురిపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయినా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. స్థానిక నాయకుల అండతోనే వాలంటీర్లు రెచ్చిపోతున్నారని.. వారి దెబ్బకు సచివాలయ ఉద్యోగులు సైతం భయపడుతున్నారిన చెప్పుకుంటున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.