యాప్నగరం

మహిళా వార్డు వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. గుంటూరులో విషాదం

శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక వార్డు వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.

Samayam Telugu 2 Jan 2021, 8:03 pm
గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా వార్డు వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డు 14వ వార్డుకి చెందిన మహిళా వాలంటీర్ సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. ఆమెను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భర్తని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.