యాప్నగరం

వెనక్కు తగ్గనంటున్న వైసీపీ.. చంద్రబాబుకు పోటీగా షాకింగ్ నిర్ణయం

Samayam Telugu 20 Oct 2021, 9:55 pm
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పేరు అనే పేరుతో చంద్రబాబు దీక్ష నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ కూడా రేపు, ఎల్లుండు దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకారాత్మక చిత్రం


జనాగ్రహ దీక్షల పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి రెండ్రోజులు ఈ దీక్షలు చేపట్టనున్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండ్రోజుల పాటు నిరసనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.