యాప్నగరం

Bull Cart Ride To Delhi: చెల్లెలి కోసం అన్న సాహసం.. ఢిల్లీకి ఎడ్ల బండిపై తల్లితో బయల్దేరిన యువకుడు

Delhiకి ఎడ్ల బండిపై బయల్దేరిన యువకుడు.. తన చెల్లెలికి న్యాయం జరగకపోవడంతో హస్తినకు వెళ్లాలని నిర్ణయించాడు. తన తల్లితో కలిసి ఎండ్ల బండిపై బయల్దేరి పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఇంతకీ అతడి చెల్లికి వచ్చిన కష్టమేంటి.. అతడు ఏం చెబుతున్నాడంటే..

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 May 2022, 9:48 pm

ప్రధానాంశాలు:

  • ఎన్టీఆర్ జిల్లా టూ ఢిల్లీకి ఎడ్ల బండిపై
  • చెల్లెలికి అన్యాయం జరగిందన్న అన్న
  • తల్లితో కలిసి పెద్ద సాహసమే చేస్తున్నాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఢిల్లీకి ఎడ్ల బండిపై
చెల్లెలి కోసం ఓ అన్న పెద్ద సాహసమే చేస్తున్నాడు. తోబుట్టువుకు వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో.. న్యాయం కోసం తల్లితో కలిసి ఏకంగా దేశ రాజాని ఢిల్లీకి ఎడ్ల బండిపై బయల్దేరాడు. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని, అసలు ఎదురైన సమస్యను చెప్పకున్నాడు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురంకు చెందిన కొంగర నరేంద్రనాథ్‌‌తో 2018లో వివాహం చేశారు. కట్నం కింద రూ.23 లక్షల డబ్బు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని నరేంద్ర చెబుతున్నాడు. పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని.. పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించాడు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చినట్లు చెప్పాడు.

ఈ ఘటన అనంతరం చందర్లపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. ఆ తర్వాత నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేదని నరేంద్ర ఆరోపిస్తున్నాడు. అందుకే విసిగిపోయిన తమకు ఏపీలో న్యాయం దొరకదని నిర్ణయానికి వచ్చానన్నాడు. అందుకే తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ వెళ్లి.. అక్కడ సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు.

తన సోదరికి న్యాయం చేయాలంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన తెలంగాణకు చేరుకున్నాడు. తన సోదరి అత్తింటిలో ఎదుర్కొన్న వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిందన్నాడు నరేంద్ర. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమకు న్యాయం జరగలేదంటున్నాడు. అందుకే ఇలా ఎడ్ల బండిపై హస్తినకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.