యాప్నగరం

కార్మికులు లేని సభలో ఈ అరుపులేంటి..? అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

విజయవాడ సత్యనారాయణపురంలోని పలు వీధులలో కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 May 2022, 12:44 pm
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడ సత్యనారాయణపురంలోని గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు స్వయంగా అడిగి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ శర్వాణి మూర్తి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు గతంలో కార్మిక మంత్రిగా ఉండి కార్మికులు నగదు దోచుకున్నారని ఆరోపించారు. కార్మికులు లేని సభలో అచ్చెన్నాయుడు గాడిదిలా అరిచారని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కార్మిక ఆటో కార్మికులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
Samayam Telugu ఎమ్మెల్యే మల్లాది విష్ణు


సత్యనారాయణపురంలో ఆరు వీధులలో పర్యటించి.. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిన్న సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కరించాలని అధికారులకు సూచించామని చెప్పారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్ల గురించి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని.. జూన్ నెలలోపు అన్ని పరిష్కరిస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల గొప్పతనం గురించి.. ప్రజలు తనతో చెబుతున్నారని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షం వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే తమ ఎజెండాను.. అందుకు అణుగుణంగా తమ పరిపాలన సాగుతోందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.