యాప్నగరం

విశాఖలో డబుల్ ఇస్మార్ట్: 50+ కవలలు ఒకే చోట.. సెలబ్రేషన్స్ పీక్స్!

విశాఖపట్నం నగరంలో 50కి పైగా కవలల జంటలు ఒకే వేదిక పంచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంత మంది కవలలు ఒకే వేదికపైకి రావడంతో అక్కడ ఉన్నవారంతా మైమరచిపోయారు.

Samayam Telugu 23 Feb 2021, 7:34 pm
అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని రాక్‌డెల్ హోటల్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. దాదాపు 50కి పైగా కవలల జంటలు ఒకే వేదికపై సందడి చేశారు. డబుల్ సిమ్ కార్డ్ మాదిరిగా, అంత మంది కవలలు ఒకేసారి ‘ఇస్మార్ట్’గా ఎంట్రీ ఇవ్వడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా వారిలో ఉన్న అద్భుత టాలెంట్స్‌ను అందరిముందు ప్రదర్శించారు. ఒకే పోలికలతో ఉన్న జోడిలను చూసి అక్కడికి వచ్చిన వారు మైమరచిపోయారు.
Samayam Telugu విశాఖలో కవలల సెలబ్రేషన్స్



ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కవలలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రామరాజు, లక్ష్మణరాజు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ సంస్థ తరఫున కవలల దినోత్సవాన్ని నిర్వహించి, వారిలో ఆత్మస్థైర్యం, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవలలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

ఈ కవలలంతా ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా టచ్‌లో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కలుస్తారు. కానీ 2020లో కరోనా కారణంగా వారి సంబరాలకు బ్రేక్ పడింది. 2021 మాత్రం రెట్టించిన ఉత్సాహంతో అందరూ గ్రాండ్‌గా సంబరాలు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.