విశాఖపట్నంలో పప్పుల చీటీ మోసం బయటపడింది. చీటీ వేసిన నిర్వాహకురాలు బోర్డు తిప్పేసింది. సంక్రాంతికి పండక్కి నిత్యావసరాలు ఇస్తామని చెబుతూ వందలాది మంది మహిళల నుంచి నెలకు 360 రూపాయలు కట్టించుకున్న దేవీ అనే మహిళ ఇప్పుడు టోకరా ఇచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మంగళవారం గోపాలపట్నం పోలీస్స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. వారికంటే ముందే పీఎస్కు చేరుకున్న నిందితురాలు దేవీ తమను బెదిరింపులకు గురిచేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కట్టిన డబ్బులు తిరిగిచ్చే ప్రసక్తే లేదని పోలీసుల ముందే తెగేసి చెబుతోందని.. తమకు దిక్కెవరని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో కూడా ఇదే తరహాలో మోసం బయటపడింది. ఓ గ్రామ వాలంటీర్ చీటీల పేరుతో ఏకంగా 1250 మందిని ముంచేసింది. శ్రీలేఖ నెలిమర్ల మండలం కొండగుంపాంలో గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పని చేస్తోంది. ఏడాదంతా డబ్బులు కడితే సంక్రాంతి పండగకు సరిపడా సరకులు ఇస్తానని ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఆడవాళ్లను నమ్మించింది. నెలకు రూ.300 చొప్పున వసూలు చేసింది. ఇలా చాలామంది మహిళలు డబ్బలు కట్టారు.
కొందరు క్రిస్మస్ పండుగ కోసం సామాగ్రి ఇవ్వాలని అడగటంతో.. శ్రీలేఖ వాళ్లకు మాయ మాటలు చెప్పింది. మహిళల నుంచి ఒత్తిడి రావడంతో ఆమె పరారయ్యింది. ఆ తర్వాత బాధితులు మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. ఆమె దాదాపు రూ.4 కోట్లు వసూలు చేశారని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో ఈ చీటీలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు.. కొందరు నమ్మకంగా డబ్బులు తీసుకుని వస్తువులు ఇవ్వడంతో నమ్మేస్తున్నారు. కానీ కొందరు ఇలా మోసం చేస్తున్నారు.
కొందరు క్రిస్మస్ పండుగ కోసం సామాగ్రి ఇవ్వాలని అడగటంతో.. శ్రీలేఖ వాళ్లకు మాయ మాటలు చెప్పింది. మహిళల నుంచి ఒత్తిడి రావడంతో ఆమె పరారయ్యింది. ఆ తర్వాత బాధితులు మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. ఆమె దాదాపు రూ.4 కోట్లు వసూలు చేశారని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో ఈ చీటీలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు.. కొందరు నమ్మకంగా డబ్బులు తీసుకుని వస్తువులు ఇవ్వడంతో నమ్మేస్తున్నారు. కానీ కొందరు ఇలా మోసం చేస్తున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News