యాప్నగరం

ఆడపిల్లల మానానికి రేటు.. సీఎం, హోంమంత్రి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి: వంగలపూడి అనిత

రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని.. లేదంటే సీఎం, హోంమంత్రి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అత్యాచార యత్నంకు గురైన బాలిక..

Samayam Telugu 21 Jan 2022, 1:43 pm
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అత్యాచార యత్నంకు గురైన బాలిక కుటుంబ సభ్యులను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం పోలీస్ ష్టేషన్ ముందు ఆమె ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు.
Samayam Telugu వంగలపూడి అనిత


'ఏదైనా సంఘటన జరిగితే హోంమంత్రి చెక్కులు పట్టుకొని దిగుతుంది. ఆడపిల్లల హత్యకు గురైతే రూ.10 లక్షలు, అత్యాచారం అయితే రూ.5 లక్షలు ఇచ్చి ఆడపిల్లల మానానికి రేటు కడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు తండ్రిగా ఉన్న సీఎం గారు.. ఓ ఆడపిల్ల తల్లిగా ఉన్న హోంమంత్రి గారు.. ఓ ఆడపిల్ల తల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నా ఆడపిల్లలకు రక్షణ కల్పించండి.. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి..' అంటూ అనిత ఫైర్ అయ్యారు. ఆడపిల్లల బాధ అర్థం చేసుకోలేని హోంమంత్రి.. ఆ పదవిలో ఉండటం ఆడదానిగా తాను బాధపడుతున్నానని అన్నారు.

నిందితుడు బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. కత్తితో బెదిరించి న్యూడ్‌గా వీడియోలు తీశాడని.. బాలిక అక్క న్యుడ్ ఫోటోలు కావాలని బెదిరించాడని అనిత అన్నారు. నిందితుడు బయటకు వస్తే చంపేస్తాడని బాలిక బయపడుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దిశ లేని ఆ దిశకు కేసు అప్పజేబుతామని పోలీసులు అంటున్నారని.. దాని వల్ల మూడు నెలల్లో నిందితుడు బయటకు వచ్చి హాయిగా తిరుగుతాడని అన్నారు. రాజయ్యపేటలో మైనర్ బాలికపై అత్యాచారం యత్నం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.