యాప్నగరం

విశాఖవాసులకు శుభవార్త.. జనవరి 1 నుంచి బస్సులు

రవాణా సేవలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని రోడ్డు మీదకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.లాక్‌డౌన్‌తో‌ ఈ బస్సుల్ని నిలిపివేయగా.. వీటిలో తొలి విడతగా 20 బస్సులను నడపాలని విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది.​​

Samayam Telugu 11 Dec 2020, 9:32 am
ఆర్టీసీ అద్దె బస్సుల సేవలు జనవరి 1 నుంచి వినియోగించుకోనున్నామని విశాఖ రీజనల్‌ మేనేజర్‌ ఏసుదానం అన్నారు. అనకాపల్లి డిపోను సందర్శించిన ఆయన.. ఆఱ్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్ల శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల అందజేశారు. శిక్షణను లాంఛనంగా ప్రారంభిస్తూ ప్రత్యేక బస్సును ప్రారంభించారు. ఆర్టీసీ నిరుద్యోగ యువతకు తక్కువ వ్యయంతో ఇస్తున్న డ్రైవర్ల శిక్షణకు ఆదరణ పెరుగుతోందన్నారు. రీజియన్‌ పరిధిలో ఇప్పటికే సుమారు 90 శాతం బస్సులు నడుపుతున్నామన్నారు. వందశాతం బస్సులు నడపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Samayam Telugu apsrtc decided to run rent buses from january 1st in vizag
విశాఖవాసులకు శుభవార్త.. జనవరి 1 నుంచి బస్సులు


ప్రయాణికుల రద్దీ, ఆదాయం కూడా పెరుగుతోందన్నారు ఏసుదానం. 50 శాతం ధరలు తగ్గించడంతో ఆర్‌టీసీ కార్గో సేవలకు ఆదరణ పెరుగుతోందని.. ఇంటింటికీ కార్గో సేవలను అందజేయడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అనకాపల్లి డిపో నుంచి ప్రస్తుతం పర్లాకిమిడి బస్సు నడుస్తోందన్నారు. రాయగడ బస్సుకు సరైన ఆదాయం లేకపోవడంతో నిలిపివేశామన్నారు. రీజియన్‌ పరిధిలో ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించాలన్నా అనకాపల్లి అన్ని విధాలా అనుకూలత ఉందన్నారు.

నగరంలో సిటీ బస్సుల సంఖ్య పెరగనుంది. పీటీడీ బస్సులకు అదనంగా అద్దె బస్సుల్లో కొన్నింటిని తీసుకొని వాటిని ప్రయాణికుల రవాణా సేవలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని రోడ్డు మీదకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.లాక్‌డౌన్‌తో‌ ఈ బస్సుల్ని నిలిపివేయగా.. వీటిలో తొలి విడతగా 20 బస్సులను నడపాలని విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.