యాప్నగరం

విశాఖ: పొద్దున్నే పెళ్లి.. పెళ్లికూతురి నగలు మాయం.!

పెళ్లికూతురి నగలు మాయం కావడం కల్యాణ మండపంలో కలకలం రేపింది. భారీగా బంగారం చోరీ కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

Samayam Telugu 24 Dec 2020, 5:47 pm
ఉదయాన్నే పెళ్లి జరగబోతోందన్న సంతోషంలో ఉన్న రెండు కుటుంబాలకు ఊహించని షాక్ తగిలింది. అర్ధరాత్రి పెళ్లి కూతురి నగలు మాయమయ్యాయి. సుమారు 53 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడం కల్యాణ మండపంలో కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ ఎమ్మార్వో కొడుక్కి అనకాపల్లి మునగపాక మండలం తోటాడ గ్రామం సిరసపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువతితో వివాహం నిశ్చయమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gold


నగర శివారులోని సాయిప్రియ రిసార్ట్స్‌లో ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. ఉదయాన్నే పెళ్లి కావడంతో వధూవరుల కుటుంబాలు బుధవారం రాత్రి రిసార్ట్‌లో బస చేశారు. రాత్రి 12 గంటల వరకు పెళ్లి వారంతా మేల్కొనే ఉన్నారు. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో రూమ్ నంబర్ 301లో ఉంచిన పెళ్లి కూతురి నగలు మాయమయ్యాయి. 53 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో పెళ్లి బృందం లీసులను ఆశ్రయించింది. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.