యాప్నగరం

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు

పోలీసులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదైంది. నర్సీపట్నంలో మరిడిమాంబ ఉత్సవాల సందర్భంగా అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 17 Apr 2022, 10:20 am
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. నర్సీపట్నంలో పోలీసుల పట్ల దురసుగా వ్యవహరించిన ఆయనపై సెక్షన్ 353తోపాటు మరికొన్ని సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడిమాంబ ఉత్సవాల సందర్భంగా అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా పండుగ అనుమతుల కోసం ఏఎస్పీ మణికంఠ ఛందోలును అయ్యన్న పాత్రుడు కలిసినప్పుడు.. ఏఎస్పీ పట్ల అయ్యన్న హేళనగా మాట్లాడినట్లు సమాచారం.
Samayam Telugu అయ్యన్న పాత్రుడు


ఇటీవల నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ ఉత్సవాలకు పోలీసులు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అయితే అర్ధరాత్రి దాటినా కార్యక్రమాలు కొనసాగడంతో.. పోలీసులు ఆపేయాలని ఆదేశాలు చేశారు. ఈ సమయంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అక్కడికి చేరుకుని.. ఉత్సవాలు నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు. ఆయన దగ్గర ఉండి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పోలీసుల పట్ల వ్యాఖ్యలపై కేసు నమోదైంది.

మరిడిమాంబ ఉత్సవాల నిర్వహణకు ఏఎస్పీ అనుమతి ఇవ్వలేదని అయ్యన్న పాత్రుడు ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించుకోలేదని.. ఈసారి ఘనంగా చేద్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.