Fake Currency: తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడి.. గిరిజనులను మోసం చేస్తున్నారు. వారిని పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి పంపారు. తెలంగాణలోని పాల్వంచలో పొదిల మురళి ఇంట్లో రహస్యంగా నోట్లు తయారు చేసి.. మన్యంలోని పలు ప్రాంతాల్లో చలామణి చేస్తున్నారు. పాల్వంచలో ముద్రించిన వీటిని వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, ఛత్తీస్గఢ్లోని కుంట పరిసర ప్రాంతాల్లో రద్దీగా ఉండే పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు, హోటళ్ల వద్ద చీకటి పడిన తరువాత మార్చారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో సుమారు రూ.2.5 లక్షల విలువైన నోట్ల మార్పిడి జరిగినట్లు గుర్తించినట్లు AP Police గుర్తించారు. సినిమా షూటింగ్ల కోసం ముద్రించిన రూ.500 నోట్లను.. అమాయకులకు ఇచ్చి మోసం చేస్తున్నారని పోలీసులు వివరించారు. రూ.500 నోట్లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తీసుకోవాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎవరిపై అయినా అనుమానం వస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని చింతూరులో ఎస్పీ సతీశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పెట్రోల్ బంక్, హైవేల పక్కన ఉండే దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News