యాప్నగరం

కరోనా భయంతో కఠిన నిర్ణయం.. విశాఖలో విషాదం

విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందని కుంగిపోయిన ఓ వ్యక్తి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 22 May 2021, 5:24 pm
దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా సోకి కొందరు మృత్యువాతపడితే.. ఆక్సిజన్ అందక.. సరైన సమయంలో వైద్యం లభించక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు కరోనా భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటన తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకుంది. కరోనా సోకిందన్న భయంతో ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kills self


విశాఖ నగరానికి చెందిన సుధాకర్(49)కి ఇటీవల కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో స్థానిక విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోవిడ్ సోకిందన్న భయంతో రోజురోజుకీ కుంగిపోయిన సుధాకర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమాంతం ఆస్పత్రి భవనంపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రగాయాలపాలైన సుధాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఇమానుయేల్ రాజు తెలిపారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.