యాప్నగరం

ఐదు కోట్ల రూపాయలతో అమ్మవారికి అలంకరణ.. రెండు కళ్లు చాలవు..

Samayam Telugu 13 Oct 2021, 5:56 pm
దసరా నవరాత్రుల్లో అమ్మవారి శోభ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. విశాఖ వన్‌టౌన్‌లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బుధవారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చింది.
Samayam Telugu విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి అమ్మవారు


ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అధికారులు రూ.5 కోట్లతో అలంకరణ చేశారు. నూతన కరెన్సీ నోట్లు, బంగారం, వెండి ఆభరణాలతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. మహాలక్ష్మి అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు.

ఇలానే సోమవారం రోజు.. నెల్లూరు స్టోన్‌హౌస్ పేటలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ధనలక్ష్మి దేవిగా దర్శనమిచ్చింది. ఈ అలంకరణలో భాగంగా అమ్మవారిని, ఆలయాన్ని నయనానందకరంగా అలంకరించారు. దాదాపు రూ.10 కోట్ల ఖర్చుతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రూ.5.16 కొత్త కరెన్సీ నోట్లతో పాటు, 7 కిలోల బంగారం, 60 కిలోల వెండిని ఈ అలంకరణలో ఉపయోగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.