యాప్నగరం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. గాయపడ్డ వారు వీళ్లే!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో శనివారం ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో 9 మందికి కార్మికులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 11 Feb 2023, 4:31 pm
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో బాధితులంతా సేఫ్ అని తెలుస్తోంది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయాలపాలవగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Samayam Telugu గాయపడ్డ వారికి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం


ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.


గాయపడ్డ వారి వివరాలివే..
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్, పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు ఉన్నారు. అయితే, బాధితులకు 20 శాతం నుంచి 30 శాతం మేర గాయాలు కావడంతో ప్రాణపాయం తప్పందని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సిరియస్ ఉండటంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్‌ కార్మిక సంఘ నాయకులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.