యాప్నగరం

Nara Lokesh పాదయాత్రలో 'గంటా'.. జోష్‌లో తెలుగు తమ్ముళ్లు

Nara Lokesh: ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. నేతలు కూడా ఒక్కొక్కరు మళ్లీ బయటకు వచ్చి యాక్టివ్ అవుతున్నారు. ఇన్నాళ్లు వివిధ కారణాలతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న గంటా శ్రీనివాస రావు మళ్లీ పొలిటికల్ యాక్టివిటీస్ పెంచారు. తాజాగా.. ఆయన లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. గట్టిగా నినాదాలు చేస్తూ.. పాదయాత్రలో పాల్గొన్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 21 Mar 2023, 3:49 pm

ప్రధానాంశాలు:

  • కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ పాదయాత్ర
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి గంటా
  • గంటా ఎంట్రీతో జోష్‌లో తెలుగు తమ్ముళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ganta Srinivasa Rao with Lokesh
లోకేష్‌తో గంటా శ్రీనివాస రావు
Nara Lokesh: అనంతపురం జిల్లా కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొని లోకేష్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా.. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘిభావం ప్రకటించారు. లోకేష్‌తో కలిసి కొంత దూరం నడిచారు. ఆయన తోపాటు.. విశాఖ జిల్లాకు చెందిన కొందరు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
కొన్నాళ్లుగా గంటా శ్రీనివాస రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే.. పార్టీ మార్పు అంశంపై గంటా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి అనారోగ్య సమస్యలే కారణమని స్పష్టం చేశారు. దీంతో పార్టీ మార్పు చర్చ తగ్గింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో గతంలో పార్టీకి దూరంగా ఉన్న నేతలు.. మళ్లీ యాక్టివ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గంటా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లలో మరింత జోష్ పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.