యాప్నగరం

విశాఖలో విషాదం.. నీటమునిగి ముగ్గురి మృతి

కాయకష్టం చేసుకునేందుకు బయల్దేరిన కర్షకులను వాగు మింగేసింది. పొలం పనులకు వెళ్తున్న ముగ్గురిని కబళించింది. విశాఖ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.

Samayam Telugu 11 Jul 2021, 8:41 pm
విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్తూ పెద్దేరు వాగులో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ల వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దేరు వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టడంతో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరొకరిని నర్సీపట్నంకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
deaths


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.