యాప్నగరం

లారీ చక్రాల కింద నలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగిని.. ఆ పొరపాటే ప్రాణం తీసింది.

విశాఖపట్నం నగరంలోని గురుద్వారా జంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులో విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తున్న అల్లూరి జయశ్రీ రెడ్డి అనే మహిళను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

Samayam Telugu 17 Jun 2021, 8:14 am

ప్రధానాంశాలు:

  • విశాఖ గురుద్వారా జంక్షన్లో ప్రమాదం
  • బ్యాంకు ఉద్యోగినిని ఢీకొన్న లారీ
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన అల్లూరి జయశ్రీ రెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu vizag
విశాఖ నగరంలో గురుద్వారా జంక్షన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగిని దుర్మరణం చెందారు. వైజాగ్ ఫోర్త్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం... అల్లిపురానికి చెందిన అల్లూరి జయశ్రీ రెడ్డి(35) సీతమ్మధార హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి బయలుదేరారు.
గురుద్వారా జంక్షన్‌లో కాంప్లెక్స్‌ వైపు వెళ్లడానికి అకస్మాత్తుగా కుడివైపునకు స్కూటీని తిప్పపడంతో వెనుక వస్తున్న సిమెంట్‌ మిక్సర్‌ లారీ ఢీకొంది. లారీ చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో జయశ్రీ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో గురుద్వారా జంక్షన్‌లో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జయశ్రీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఈ ప్రమాదంపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.