యాప్నగరం

విశాఖ: ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

విశాఖపట్నం ఇడస్ట్రియల్ కారిడార్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా, భారీగా ఆస్తి నష్టం..!

Samayam Telugu 27 Jan 2021, 11:49 pm
విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖనగరంలోని అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్‌ వంట నూనెల కంపెనీలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
Samayam Telugu విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం


ఈ సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేరని సమచారం. అయితే నూనెల కంపెనీ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఫైరింజన్లతో ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ కంపెనీలో డబ్బాలు, ప్యాకెట్లలోకి నూనెను నింపుతారు. దువ్వాడ సీఐ పి.లక్ష్మి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అటువైపుగా ఎవరినీ రానీయడం లేదు. అయితే మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండటంతో ప్రజలు మాత్రం ఆందోళనలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.