యాప్నగరం

విశాఖ: భార్యను ఆస్పత్రిలో చేర్పించి.. తర్వాత, భర్త ఏం చేశాడో తెలిస్తే.. షాక్!

విశాఖపట్నం జిల్లాలోని కేజీహెచ్ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 10 Apr 2021, 12:16 am
విశాఖపట్నం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రిలో చేర్పించిన భర్త అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ వ్యవహారంపై ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం కొత్తవీధి మండలం రామగెడ్డ గ్రామానికి చెందిన కుర్జి గణేష్‌కుమార్‌ (30).. తన భార్య సరస్వతికి అనారోగ్యం ఉండటంతో ఈనెల 3వ తేదీన కేజీహెచ్‌లో చేర్పించారు.
Samayam Telugu విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి


రెండు రోజుల పాటు అక్కడే ఉన్న గణేష్.. తర్వాత ఈనెల 5న ఆస్పత్రిలో మళ్లీ వస్తానని బంధువులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగిరాలేదు. అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గణేష్‌కుమార్‌ అన్నయ్య కళ్యాణ్‌ కుమార్‌ ఒకటో పట్టణ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.