యాప్నగరం

విశాఖకు పవన్ కల్యాణ్.. కేంద్రంతో ఢీకొట్టేందుకేనా..?

Samayam Telugu 25 Oct 2021, 7:49 pm
జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా నిలబడనున్నారు. ఈ మేరకు ఈ నెల 31వ తేదీన గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు జనసేన తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. గాజువాకలోని స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
Samayam Telugu పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొదట స్పందించింది పవన్ కల్యాణే అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 9వ తేదీనే హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పవన్ కల్యాణ్ వినతిపత్రం అందిచనట్లు చెప్పారు. 34 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 256వ రోజు కొనసాగుతున్నాయి. బొగ్గు గనుల నిక్షేపాలను రానున్న నాలుగేళ్లలో విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను కార్మికులు తప్పుబట్టారు. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సింటర్ ప్లాంట్ కార్మికులు వివరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ, పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.