యాప్నగరం

శ్రీకాకుళం జిల్లాలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం... నెల రోజుల్లోనే రెండోసారి

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నెలరోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 4 Jan 2021, 9:55 am
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహం, విజయవాడలో సీతమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనలు మరువకముందే శ్రీకాకుళంలో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టెక్కలిలోని బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధ్వంసం చేశారు.
Samayam Telugu బుద్ధ విగ్రహం  చేతిని విరగ్గొట్టిన దుండగులు


ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేయడాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే శిల్పి సాయంతో ఆ విగ్రహానికి కొత్త చేతిని అమర్చారు. అయితే ఆదివారం నాడు బుద్ధుడి చేయి భాగాన్ని దుండగులు మళ్లీ విరగొట్టారు.

ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పార్కును పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు తెలిపారు. ఇది ఆకతాయిల పనిగా అధికారులు అనుమానిస్తున్నారు. అసలే హిందూ దేవతల విగ్రహాల ధ్వంసంపై రాష్ట్రం అట్టడుకిపోతున్న సమయంలో శాంతికి ప్రతిరూపమైన బుద్ధుడి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన ఘటన మరింత కలకలం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.