యాప్నగరం

Visakha: ప్రేమలో పడిన భార్య.. భర్త ఆత్మహత్య.! చివరికి..

పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న జంట ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం షాక్‌కి గురిచేసింది.

Samayam Telugu 18 Dec 2020, 2:18 pm
భర్తతో విభేదించిన భార్య మరొకరితో ప్రేమలో పడింది. భర్తను వదిలేసి వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. మూడు రోజులు తిరక్కుండానే కొత్తజంటకు కాలం చెల్లింది. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన విశాఖ నగరంలో వెలుగుచూసింది. గాజువాక సుందరయ్యనగర్‌లో నిన్న ఇల్లు అద్దెకు తీసుకున్న జంట తెల్లారేసరికి విగతజీవులుగా కనిపించారు. ఉరికి వేలాడుతున్న జంటను చూసి ఇంటి యజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
couple suicide


విశాఖ జిల్లాకు చెందిన మోటూరు నాగిణికి ఐదేళ్ల కిందట పాపారావు అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి అనంతరం అండమాన్‌లో కాపురం పెట్టారు. భర్తతో ఆమెకు విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరవాడ మండలం బోనంగికి చెందిన అభిలాష్‌(33)తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆమె భర్త పాపారావు ఆత్మహత్య చేసుకున్నాడు.

అభిలాష్, నాగిణి మూడు రోజుల కిందట పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం గాజువాక సుందరయ్యనగర్‌లో నిన్న ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈరోజు ఉదయం కొత్త జంట అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఎంతసేపటికీ తలుపుతీయకపోవడంతో కిటికీలో నుంచి చూసిన ఇంటి యజమాని వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు రోజుల కిందట పెళ్లి చేసుకున్న జంట ఆత్మహత్య మిస్టరీగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అక్క భర్తతో పెళ్లికి ఒప్పుకోని చెల్లెలు.. పక్కా ప్లాన్‌తో బావ ఘాతుకం.. చిత్తూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.