యాప్నగరం

భార్యంటే ఎంత ప్రేమ.. మృతదేహంపై పడి రోదిస్తూ భర్త మృతి

భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త.. ఆమె మృతదేహంపై రోదిస్తూ మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరి మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Samayam Telugu 29 Oct 2021, 4:10 pm
అన్యోన్య దాంపత్యం.. ఈ మాటని చెవులతో వినడమే గానీ.. కళ్లతో చూడటం ఈ రోజుల్లో చాలా కష్టం. చిన్న చిన్న గొడవలకే Egoలకు వెళ్లి జీవితాల్ని సర్వ నాశనం చేసుకుంటున్న సమాజంలో బతుకుతున్నాం. అలాంటిది భార్య మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి భర్త చనిపోయారంటే నమ్మగలమా.. విశాఖ జిల్లాలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకారాత్మక చిత్రం


భార్య మరణాన్ని తట్టుకోలేక.. భర్త కుప్పకూలిన సంఘటన విశాఖ జిల్లా రావికమతంలో చోటుచేసుకుంది. రావికమతం గ్రామానికి చెందిన వెంకటరమణ (56), భవాని (51) భార్యాభర్తలు. కిరాణా, ఫ్యాన్సీ షాపు నడుపుతున్న వీరికి సంతానం లేరు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలనుకున్న వీరికి ఆ కోరిక ఎన్నేళ్లయినా తీరకపోవడంతో.. భవాని తన అక్క మనవను దత్తత తీసుకున్నారు.

అయితే ఇటీవల కాలంలో భవాని అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె తీవ్ర అనారోగ్యంతో చోడవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. భార్య మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన వెంకట రమణ.. ఆమె మృతదేహంపైనే రోదిస్తూ గుండెపోటుకు గురై మరణించాడు.

ఇలా.. భార్య మరణాన్ని తట్టుకోలే భర్త కూడా మరణించడంతో రావికమతం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంటల వ్యవధిలోనే భార్యభర్తలు మరణించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.