యాప్నగరం

రైల్లో పురుడు పోసిన వైద్య విద్యార్థిని.. తల్లీబిడ్డ సేఫ్!

పురిటినొప్పులతో అల్లాడుతున్న గర్భిణికి ఓ వైద్య విద్యార్థిని రైల్లోనే కాన్పు చేశారు. విద్యార్థిని చేసిన పనికి అందరూ అభినందనలు తెలిపారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 13 Sep 2022, 10:41 pm
వైద్య విద్య పూర్తికాక ముందే ఓ విద్యార్థిని రెండు నిండు ప్రాణాలను నిలబెట్టి శభాష్ అనిపించుకున్నారు. రైల్లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి పురుడు పోసి.. తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం దురంతో ట్రైన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణి దురంతో ట్రైన్‌లో ఎక్కారు.
Samayam Telugu రైల్లో పురుడుపోసిన వైద్య విద్యార్థిని


అయితే, అనకాపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులతో విలవిలలాడారు. ఈ సమయంలో అదే భోగీలో ప్రయాణిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థిని.. సదరు మహిళకు ధైర్యం చెప్పారు. నొప్పులు ఆగకపోవడంతో తోటి ప్రయాణికుల సాయం తీసుకుని రైల్లోనే పురుడు పోశారు. బిడ్డ బయటకు రావడం, తల్లి కూడా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలను కాపాడిన వైద్య విద్యార్థినిని అందరూ అభినందించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.