యాప్నగరం

Visakhapatnam: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ది భార్యాభర్తల అనుబంధం: గుడివాడ అమర్నాథ్

Visakhapatnam: దావోస్‌లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే.. ఏపీ డైలాగ్స్ పేలుతున్నాయి. ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రిపై అపోజిషన్ లీడర్లు విమర్శలు గుప్పిస్తే.. వాటికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు గుడివాడ అమర్నాథ్. దావోస్ వెళ్లి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకున్న టీడీపీ పాలకులు.. ఒక్కటైనా గ్రౌండ్ చేశారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. బిల్డప్ బాబు దావోస్‌కు వెళ్లి ప్రచారాలకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. విజయవాడ దావూద్ ఇబ్రహీం, కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుడు వచ్చి జగన్ గురించి మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Jan 2023, 7:56 pm

ప్రధానాంశాలు:

  • ప్రతిపక్షాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
  • టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయాలని సూచన
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే టాప్ అని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gudivada Amarnath
గుడివాడ అమర్నాథ్
Visakhapatnam: పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రచారాలు ప్రారంభిస్తే మంచిదని.. ఇరు పార్టీలకు ఖర్చులు కలిసి వస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ది భార్యాభర్తల అనుబంధం అని పంచ్‌లు పేల్చారు. వారాహి మీద పవన్ కళ్యాణ్ ఒక్కరే పర్యటిస్తారా.. చంద్రబాబుతో కలిసి వస్తారో చెప్పాలని నిలదీశారు. కరువు, చంద్రబాబు (Chandrababu) కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. జీవో నెంబర్-1 మీద సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్పీ వేశామని.. రహదారులపై బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.
దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarnath) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. నవంబర్ 25నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందిందని మంత్రి వెల్లడించారు. విశాఖలో సదస్సు ఏర్పాటు చేస్తున్నందుకే దావోస్‌కు వెళ్లలేదని అమర్‌నాథ్ వివరించారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు దావోస్ వెళ్లి చంద్రబాబు.. ఏం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.