యాప్నగరం

పలాస టీడీపీ కార్యకర్త అరెస్ట్.. ఎస్సై ఆడియో టేప్‌ బయటపెట్టిన టీడీపీ, ఓవర్ నైట్‌లో మారిన సీన్!

పలాసలో టీడీపీ కార్యకర్తను చిన్న విషయమని చెప్పి రాత్రి 10.30 గంటల సమయంలో స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్రమ మద్యం కేసు మోపారని టీడీపీ ఆరోపిస్తోంది.

Samayam Telugu 16 Jan 2021, 1:53 pm
పలాస: తమ పార్టీ కార్యకర్త లక్కోజి వినోద్‌పై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో పండుగ రోజు అర్ధరాత్రి స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. ఉదయం కల్లా అక్రమ మద్యం అంటూ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని.. వైసీపీ గుండాలు వినోద్‌ను కొట్టారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu palasa tdp worker arrest


‘‘పండుగ రోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కేసులో చిన్న ఎంక్వయిరీ అని ఇంటి నుంచి తీసుకువెళ్లారు. తర్వాత వైసీపీ రౌడీలతో బాగా కొట్టించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్రమ మద్యం రవాణా అంటూ తప్పుడు కేసు పెట్టారు.

వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు సామాన్యుల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. బీసీ వర్గానికి చెందిన స్వర్ణకారుడు వినోద్‌ను తెలుగుదేశం కార్యకర్త అన్న ఒకే కారణంతో పోలీసులు వేధిస్తున్నారు.
ఫోనులో ఎస్సై మాట్లాడిన దానికి, ఉదయం అతని మీద పెట్టిన కేసుకు సంబంధం ఉందా? పాతపట్నం సబ్ జైల్‌లో ఉన్న వినోద్‌ను టీడీపీ నేత గౌతు శిరీష, శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు పరామర్శించారు’’ అని టీడీపీ ట్వీట్లు చేసింది. పోలీసులు మంత్రి అప్పలరాజు సర్వెంట్‌లా వ్యవహరిస్తున్నారని గౌతు శిరీష మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.