యాప్నగరం

విశాఖకి మరో ఎదురుదెబ్బ.! కేంద్రం వరుస షాక్‌లు

ఏపీకి ప్రత్యేక హోదాపై నాన్చుతోన్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోమారు సవతి ప్రేమను చాటుకుంది. తాజాగా మరో షాకింగ్ విషయం చెప్పింది. గతంలో ఇచ్చిన హామీపై కుండబద్దలు కొట్టింది.

Samayam Telugu 23 Jul 2021, 9:20 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
visakha
ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖకు మరో షాకిచ్చింది మోదీ సర్కార్. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకున్న కేంద్రం.. రైల్వే జోన్ అంశంపై దిగ్భ్రాంతికర విషయం చెప్పింది. గతంలో ఇచ్చిన హామీని ఎప్పటికి నెరవేరుస్తామో చెప్పలేమంటూ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఏపీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకోసం రైల్వే శాఖ డీపీఆర్ కూడా తెప్పించుకుంది.

అదంతా నిజమేనని.. అయితే రైల్వే జోన్ ఎప్పటికి వస్తుందో చెప్పలేమని రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ వచ్చిందని.. కానీ ఇంకా పరిశీలనలోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని కుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు పెద్దల సభలో మంత్రి సమాధానమిచ్చారు. రైల్వే జోన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని తేల్చిచెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంతో తీవ్ర అసంతృతో ఉన్న ఏపీకి కేంద్రం మరో షాకిచ్చినట్టైంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.