యాప్నగరం

విశాఖలో ఏమిటీ ఘోరం: సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న డాల్ఫిన్స్.. అసలేం జరుగుతోంది!

విశాఖపట్నం జిల్లాలో సముద్ర తీరానికి అరుదైన డాల్ఫిన్స్ విగతజీవులుగా కొట్టుకొస్తున్నాయి.

Samayam Telugu 9 Apr 2021, 4:26 pm
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం కొమ్మాది సముద్ర తీరానికి అరుదైన జీవ సంతతికి చెందిన డాల్ఫిన్స్‌ కొట్టుకొస్తున్నాయి. డాల్ఫిన్స్ హటాత్తుగా మృత్యువాత పడటంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యానికి చేపలు, తాబేళ్లు తరచూ తీరానికి కొట్టుకుని రావడం చూశాం. గత కొద్ది రోజులుగా డాల్ఫిన్‌లు మృత్యువాత పడి తీరానికి కొట్టుకుని వస్తున్నాయి.
Samayam Telugu విశాఖ జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్


మంగళవారం సాయంత్రం సాగర్‌నగర్‌ తీరానికి డాల్ఫిన్‌ కళేబరం ఒకటి కొట్టుకొచ్చింది. గురువారం కూడా మరో డాల్ఫిన్‌‌ కళేబరం కొట్టుకొచ్చింది. వరుసగా డాల్ఫిన్లు మృత్యువాత పడుతుండటంపై స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశాఖపట్నం జిల్లా మత్య్సశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శీతల వాతావరణంలో జీవించే ఈ డాల్ఫిన్లు ప్రస్తుతం ఉష్ణాగ్రతలు అధికమవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. వీటిపై సీఎమ్‌ఎఫ్‌ఆర్‌ఐ సైంటిస్ట్‌లతో కలసి పరిశీలించనున్నట్లు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.