యాప్నగరం

ఎంపీ విజయసాయిరెడ్డి లేఖకు స్పందించిన ఆర్బీఐ

Samayam Telugu 23 Oct 2021, 10:37 pm
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బ్యాంక్ రుణాల అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆ లేఖలో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఆర్బీఐ స్పందించింది.
Samayam Telugu విజయసాయిరెడ్డి


రఘురామకృష్ణరాజు బ్యాంక్ రుణాల అవకతవకలపై తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్బీఐ సీజీఎం జయశ్రీ గోపాలన్ తిరిగి విజయసాయిరెడ్డికి లేఖ రాశారు. సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బ్యాంక్ రుణాల అవకతవకలపై విచారణ చేపట్టాలని ఈ ఏడాది జూలై 21న విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. 2014-18 మధ్యలో పంజాబ్‌ కాన్సార్షియం దగ్గర రూ.826 కోట్ల రుణాలను ఇండ్‌ పవర్‌ తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.