యాప్నగరం

ఎంతో దర్జాగా బట్టల షాపులోకి, ట్రయల్ వేసుకుంటున్నట్లు నటిస్తూ..

విశాఖపట్నం మర్రిపాలెంలో బట్టల షాపులో పట్టపగలే దొంగతనం జరిగింది. ఏడుగురు యువకులు బట్టలషాపులోకి వచ్చి.. దుస్తులు కొంటున్నట్లు నటించారు. ఆ తర్వాత ట్రయల్స్ వేసుంటున్నట్లు..

Samayam Telugu 24 Jan 2022, 10:28 am
ఎంతో దర్జాగా దుస్తులు కొనేవారిలా బిల్డప్ ఇస్తూ.. ఏడుగురు యువకులు బట్టలషాపులోకి వచ్చారు. తమకు నచ్చిన దుస్తులు సెలక్ట్ చేసుకుని.. ట్రయల్ చేస్తున్నట్లు ఫోజులు ఇచ్చారు. షర్టుల మీద షర్టులు ధరించి.. షాపు మొత్తం తిరిగారు. ఏదో అడుగుతున్నట్లు కాసేపు బట్టల షాపు దుకాణదారుడితో మాట్లాడారు. కాసేపు అయ్యాక.. ట్రయల్ కోసం వేసుకున్న దుస్తులు అలాగే ధరించి.. బయటకు వెళ్లిపోయారు. డబ్బులు అడిగిన బట్టల షాపు దుకాణదారుడిని కర్రలతో బెదిరించారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
Samayam Telugu బట్టల దుకాణంలోకి దూరిన యువకులు


మర్రిపాలెంలో పట్టపగలు కొందరు యువకులు గార్మెంట్ షోరూంలో చొరబడి దుస్తులు ఎత్తుకుపోయారు. ఆదివారం ఏడుగురు యువకులు బ్లాక్ పాంథర్ గార్మెంట్ షోరూంలోకి దూరి.. నచ్చిన దుస్తులను ధరించారు. అలాగే కాస్మోటిక్స్ కూడా ఎత్తుకుపోయారు. డబ్బులు కోసం ప్రశ్నించగా.. కర్రలతో బెదిరించారు. దీనిపై దుకాణదారుడు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.