యాప్నగరం

సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడా సరికొత్త ఆలోచన!

Simhachalam Electric Buses కు సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. తిరుమల తరహాలో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ ప్రతిపాదనల్ని ట్రస్ట్ బోర్డు సభ్యులకు పంపించారు. చాలా రోజులుగా ఎలక్ట్రిక్ బస్సులపై కసరత్తు.. మొత్తానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఇక సభ్యులు అందరూ ఆమోదం తెలిపితే బస్సుల్ని కొనుగోలు చేయనున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 Jan 2023, 9:01 am

ప్రధానాంశాలు:

  • సింహాచంలో ట్రస్ట్ బోర్డు కీలక ప్రతిపాదనలు
  • ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నారు
  • ఈ మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు పంపించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Simhachalam Electric Buses
సింహాచలం వెళ్లే భక్తులకు ట్రస్ట్ బోర్డు శుభవార్త చెప్పింది. సింహాచలం దేవస్థానానికి ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఛైర్మన్‌ ఆమోదం పొందిన ప్రతిపాదనను సభ్యులకు పంపించి.. అభిప్రాయం తెలియజేయాలని కోరారు అధికారులు. ముందుగా రెండు బస్సుల్ని కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి అందిన కొటేషన్‌ను సభ్యులకు పంపారు. బస్సులకు సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను సభ్యులకు తెలియజేశారు.
ఈ బస్సులో మొత్తం 35 సీట్లు ఉంటాయి.. ధర రూ.1.55 కోట్లు.. అలాగే 43 సీట్ల బస్సుకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుంది. సింహగిరి పరిసరాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు గత రెండేళ్ల నుంచీ ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ బస్సులకు సంబంధించి ఒలెక్ట్రా సంస్థ పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ చేసింది.

సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తున్న బస్సు ఛార్జీలను పెంచాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే భక్తులపై భారం మోపడం సరికాదని, విద్యుత్తు బస్సులను ప్రవేశపెడితే వ్యయాన్ని తగ్గించుకుంటే భక్తులకు ఛార్జీల భారం ఉండదని అశోక్‌ గజపతిరాజు అన్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యుల అభిప్రాయాలు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలో కూడా పరిసరాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బస్సులు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు సింహాచలంలో కూడా ప్రతిపాదనలు చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.