యాప్నగరం

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

Ayyappa temple: శబరిమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Samayam Telugu 10 Nov 2021, 10:43 am
శబరిమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. టికెట్ల బుకింగ్ కోసం ద్వారాకా బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం రీజియన్ నుంచి 60 బస్సులను నడుపుతున్నామని చెప్పారు.
Samayam Telugu శబరిమలకు ప్రత్యేక బస్సులు


అయ్యప్ప భక్తుల కోసం సౌకర్య కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఇంద్రా, అమరావతి బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక టూర్ ప్యాకెజీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఐదు, ఆరు, ఏడు రోజుల టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ ప్రత్యేక ప్యాకేజీలు భక్తులు వెళ్లే ఆలయాల ఆధారంగా ఉంటాయి. ఏ ప్యాకేజీ కావాలో ముందే భక్తులు ఎంచుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఎంచుకున్న ప్యాకేజీని బట్టి చార్జీలు వస్తూలు చేస్తామని అధికారులు చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఒకే చోట ఉంటే ఎక్కడి నుంచైనా బస్సులు నడుపుతామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.