యాప్నగరం

సీఎం జగన్ మహా నటుడు.. నటనలో ఆయన్ను మించిన వారు లేరు.. వంగలపూడి అనిత సెటైర్లు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి (Bharathi), ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasaireddy) అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని కప్పి పుచ్చటానికే పేర్లు మార్చే కార్యక్రమం మెుదలుపెట్టారన్నారు. రాష్ట్రంలో జగన్‌కు మించిన నటుడు మరొకరు ఉండరని అన్నారు. వైద్య రంగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) చేసిన సేవ ఎవరు చేయలేదన్నట్టు సీఎం జగన్ మాట్లాడారని దుయ్యబట్టారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 25 Sep 2022, 1:42 pm
సీఎం వైఎస్ జగన్‌పై (YS Jaganmohan Reddy) టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) నిప్పులు చెరిగారు. జగన్‌కు మించిన నటుడు మరొకరు ఉండరని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి (NTR Health University) వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి (Bharathi), ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasaireddy) అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని కప్పి పుచ్చటానికే పేర్లు మార్చే కార్యక్రమం మెుదలుపెట్టారన్నారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ఫ్యాలెస్ , హైదరాబాదులోని లోటస్‌పాండ్‌కు ఎందుకు వైఎస్సాఆర్ పేరు పెట్టలేదని అనిత ప్రశ్నించారు.
Samayam Telugu anitha new
వంగలపూడి అనిత


వైద్య రంగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) చేసిన సేవ ఎవరు చేయలేదన్నట్టు సీఎం జగన్ మాట్లాడారని దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డికి, ఎన్టీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆమె విమర్శించారు. సీఎం జగన్‌కు తన తండ్రి వైఎస్ మీద ప్రేమ ఉంటే..తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను (YS Sharmila) పక్క రాష్ట్రానికి ఎందుకు పంపించారని అనిత ప్రశ్నించారు. అంతగా పేరు పెట్టుకోవాలనిపిస్తే సెంట్రల్ జైలుకు జగన్ పేరు పెట్టుకోవచ్చు కదా అని దుయ్యబట్టారు.

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంపై అనిత మండిపడ్డారు. ఆ సమావేశంలో వైఎస్సాఆర్‌సీపీ నేతలు తప్పితే ఎవరు ఉండరన్నారు. ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకు రౌండ్ టేబుల్ సమావేశమని నిలదీశారు. మూడు రాజధానులపై (Three Capitals) ఏనాడైనా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలో ఉండి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించటం ఏంటని అన్నారు. అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎం జగన్ వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యనించారు. అమరావతి నిర్మాణానికే డబ్బు లేదంటున్న ప్రభుత్వం.. మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని అనిత ప్రశ్నించారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.