యాప్నగరం

సముద్రంలో దూకి టీడీపీ నాయకుడు ఆత్మహత్య!

తెలుగు దేశం పార్టీ నాయకుడు సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. అయితే, మానసిక సమస్యల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిసింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 21 May 2022, 8:42 am
విశాఖపట్నం జిల్లా భీమిలి తెలుగు దేశం పార్టీ నాయకుడు దూకి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న టీడీపీ నాయకుడు శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై జి.ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. భీమిలి రొట్టెల వీధికి చెందిన దాసరి వెంకటేష్‌ (57) కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తూ భీమిలి మూడో వార్డు టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం



ప్రభుత్వ ఉపాధ్యాయిరాలుగా పని చేస్తున్న కుమార్తె శ్రావణికి ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఆర్థిక సమస్యలేవీ లేకపోయినప్పటికీ వెంకటేష్‌ గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ సముద్రంలో దూసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేసే కొంత మంది భీమిలి సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మానసిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని వెంకటేష్ కుమారుడు గోపీనాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వెంకటేష్‌కు సంతాపం తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.