యాప్నగరం

విశాఖ మన్యంలో వైసీపీ దోపిడీ: మైనింగ్ మాఫియా అరాచకం చూడండి.. టీడీపీ సంచలనం!

విశాఖపట్నం జిల్లా మన్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.

Samayam Telugu 1 Aug 2021, 7:49 pm
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖనిజ సంపదను దోచుకుతింటున్నారని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విశాఖపట్నం మన్యంలోకి వైసీపీ మాఫియా బాక్సైట్ అక్రమ మైనింగ్ ప్రదేశానికి ఎవరినీ రానీయకుండా బెదిరింపు బోర్డులు పెట్టి మరీ దోచుకుంటోందని ఆరోపించింది. రూ.15 వేల కోట్ల బాక్సైట్ కోసం వైసీపీ మైనింగ్ మాఫియా అడవిని నాశనం చేసిందని పేర్కొంది. ఈ మేరకు టీడీపీ వరుస ట్వీట్లు చేసింది.
Samayam Telugu విశాఖలో మైనింగ్‌పై టీడీపీ పోస్ట్



‘‘విశాఖ మన్యంలో వైసీపీ మాఫియా బాక్సైట్ అక్రమ మైనింగ్ ప్రదేశానికి ఎవరినీ రానీయకుండా బెదిరింపు బోర్డులు పెట్టి మరీ దోచుకుంటోంది. అక్కడ జరిగే దోపిడీకి ఈ బోర్డే నిదర్శనం.

అయితే రూ.15 వేల కోట్ల బాక్సైట్ కోసం వైసీపీ మైనింగ్ మాఫియా ఎంత అడవిని నాశనం చేసిందో గూగుల్ శాటిలైట్ ఫోటో చెప్పేసింది.’’ అని తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.