యాప్నగరం

అరకు సమీపంలో తెలంగాణకు చెందిన జంట ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు అరకు సమీపంలో అపస్మారస్థితిలో కనిపించారు. వీరిద్దరు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 Sep 2022, 10:58 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Araku Couple Suicide Attempt
అల్లూరి జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. అరకు చాపరాయి దగ్గర పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను స్థానికులు గుర్తించారు. వీరిని రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సిరిసింగంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ సునీతగా గుర్తించారు. ఇద్దర్ని అంబులెన్స్‌లో డంబ్రిగుడ అక్కడి నుంచి కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. గర్భవతి అయిన సునీత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు అరకు ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.