యాప్నగరం

త్వరలోనే విశాఖకు కేటీఆర్.. గంటా ఆసక్తికర వ్యాఖ్యలు!

TRS Working President కేటీఆర్ త్వరలోనే విశాఖ వెళ్లే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కేటీఆర్ వైజాగ్ వస్తారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Samayam Telugu 25 Mar 2021, 5:21 pm
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు.. నేడు (గురువారం) స్పీకర్‌ను కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ganta ktr


ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విశాఖపట్నం వస్తారని గంటా తెలిపారు. ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన రాజీనామాతో ఉప ఎన్నిక జరిగితే.. తాను మళ్లీ పోటీ చేయనని.. తన బదులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడిని పోటీ చేయిస్తానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మార్చి 20న గంటా శ్రీనివాస రావు కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్‌తో చర్చించి.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీలు, మంత్రులతో కలిసి వచ్చి ఉద్యమంలో పాల్గొంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని గంటా తెలిపారు.

మార్చి 26తో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. దీంతో మార్చి చివరి వారంలో కేేటీఆర్ విశాఖకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ వైసీపీతో టీఆర్ఎస్ నేతలకు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేటీఆర్ విశాఖ పర్యటన రాజకీయాలకు అతీతంగా సాగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.