యాప్నగరం

Gitam Medical College: బాలయ్య 'అల్లుడి' మెడికల్ కాలేజ్‌ పరిసరాల్లోని ఉత్కంఠ..!

Gitam Medical College: విశాఖపట్నంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో.. ఏం జరుగుతుందో అని స్థానికులు టెన్షన్ పడ్డారు. అయితే.. గీతం మెడికల్ కాలేజ్ పరిసరాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించడానికి వచ్చినట్టు జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది. అటు గీతం విద్యాసంస్థల ఛైర్మన్, బాలకృష్ణ అల్లుడు భరత్ కాలేజ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 6 Jan 2023, 9:39 pm

ప్రధానాంశాలు:

  • గీతం మెడికల్ కాలేజ్ పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
  • ప్రభుత్వ భూమిని గుర్తించిన రెవెన్యూ అధికారులు
  • కాలేజ్ భవనాలను కూలుస్తారని జోరుగా ప్రచారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gitam Medical College
గీతం మెడికల్ కాలేజ్
Gitam Medical College: నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌‌కు చెందిన గీతం మెడికల్ కాలేజ్ దగ్గరికి మరోసారి అధికారులు వెళ్లారు. గీతం మెడికల్ కాలేజ్ పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ.. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. అటు వైద్యకళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఎండాడ, రుషికొండ (Rushikonda) వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టడంతో.. ఆ ప్రచారం జరిగింది.
గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేస్తున్నట్లు.. భీమిలి (Bheemili) ఆర్డీవో స్పష్టం చేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, డీఆర్వో పర్యవేక్షణలో సుమారు 3 గంటలపాటు కంచె ఏర్పాటు పనులు జరిగాయి. గీతం మెడికల్ కాలేజ్ పరిసరాల్లో ప్రభుత్వ భూమి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు చేస్తున్న సమయంలో.. గీతం వైద్య కళాశాల పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. ఇదే సమయంలో కొంతమంది టీడీపీ (Telugu Desam Party) నేతలను గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశం అయ్యింది.

అయితే.. గీతం మెడికల్ కాలేజ్‌ (Gitam Medical College)ను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పుడు కంచె ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. రుషికొండలోని సర్వే నంబర్‌ 37, 38లోని స్థలాన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్నామని.. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్‌ చేశామని.. తాజాగా 5.25 ఎకరాల్లో కంచె వేశామని అధికారులు వివరించారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములే సరిహద్దులుగా ఉండటంతో కంచె ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవని వెల్లడించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.