యాప్నగరం

ఫొటో షూట్‌కెళ్లి ఊబిలోకి.. విశాఖలో ముగ్గురు యువకుల దుర్మరణం

ఫొటో షూట్‌కెళ్లి ప్రాణాల మీదుకు తెచ్చుకున్నారు ముగ్గురు యువకులు. ఫొటోలు తీసుకునే క్రమంలో ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Samayam Telugu 30 May 2021, 7:31 pm
పెళ్లినాటి మధుర జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకోవాలని తహతహలాడుతున్నారు నేటి యువత. తమ అభిరుచికి తగినట్లుగా ఫొటో షూట్‌లు చేయించుకుంటున్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. పెళ్లి ఫొటో షూట్ కోసం జలపాతం దగ్గరికి వెళ్లిన ముగ్గురు యువకులు ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. హుకుంపేట సమీపంలోని ఓ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. యువకులు ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మోరి. నిరంజన్(18), బాకురు వినోద్ కుమార్(25), తమరబ శివనాగేంద్ర కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఊబి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu యువకులు ఊబిలో చిక్కుకున్న ప్రాంతం
vizag


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.