యాప్నగరం

అనకాపల్లి: క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. సగమే జమ, ఏమైందని బ్యాంకుకు వెళ్లిన కస్టమర్ అరెస్ట్

Vizag Two Arrested In Fake Currency Case కలకలంరేపుతోంది. ఓ వ్యక్తి క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు జమ చేశాడు. అయితే అతడి ఖాతాలో సగం డబ్బులు మాత్రమే జమ అయ్యాయి. ఏమైందని ఆరా తీయడానికి వెళ్లిన కస్టమర్.. అరెస్ట్ చేసిన పోలీసులు. అప్పుడు అసలు ట్విస్వ్ బయటపడింది. మనోడి అతి తెలివితో ప్లాన్ చేసి చివర్లో అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఊరికి చెందిన మరో యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Feb 2023, 10:10 am

ప్రధానాంశాలు:

  • అనకాపల్లిలో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో సరికొత్తగా మోసం
  • నకిలీ నోట్లు మార్చేందుకు సరికొత్త ఎత్తుగడ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizag Two Arrested In Fake Currency Case
ఇద్దరు యువకులు మాస్టర్ ప్లాన్ వేశారు.. నకిలీ రూ.500 నోట్లు మార్చాలని భావించారు. మొత్తం సెట్ చేసిన తర్వాత చివర్లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అనకాపల్లిలోని యాక్సిస్‌ బ్యాంక్‌ క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్‌లో.. ఈనెల 12న చీడికాడ మండలం బైలపూడికి గుమ్మడి నిరంజన్‌ తన ఖాతాలో రూ. 70 వేల నగదు (రూ. 500 నోట్లు) డిపాజిట్‌ చేశాడు. ఇందులో రూ. 46 వేలు మాత్రమే అకౌంట్‌లో జమయ్యాయి. మొత్తం 140 నోట్లలో 48 నకిలీవి కావడంతో అవి డిపాజిట్ కాలేదు.
ఆ నకిలీ నోట్లు వేరే బాక్సులో పడ్డాయి. డిపాజిట్‌ బాక్స్‌లో నకిలీ రూ. 500 నోట్లు 48 ఉన్నాయని బ్యాంకు మేనేజర్‌ ఈనెల 16న గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈలోపు నిరంజన్‌ తన డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్‌ కాలేదని బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు బైలపూడి గ్రామానికి చెందిన రాము నకిలీ నోట్లు మారుస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి.. వీరి దగ్గర నుంచి రూ. 500 వంద నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోర్టులో హాజరుపరిచారు.

పోలీసులు వీరికి నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఫేక్ కరెన్సీని మార్చేందుకు క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్ సులభంగా ఉంటుంది భావించారు. అనుకున్న ప్లాన్‌ను అమలు చేశారు. కానీ సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ నకిలీ నోట్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.