యాప్నగరం

లాడ్జిలో ఆ రూమ్‌పై సిబ్బందికి అనుమానం.. తలుపులు బద్దలు కొట్టి చూస్తే..!

Visakhapatnam నగరంలోని ఓ లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పేరు, ఊరు తప్పా ఇతర వివరాలు ఏమి తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 6 Dec 2021, 9:46 am
అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో దిగాడు. పేరు, ఫోన్ నంబరు మాత్రమే చెప్పి రూమ్‌ తీసుకున్నాడు. ఆధార్ కార్డు ఉదయం ఇస్తానని చెప్పి గదిలోకి తలుపులు వేసుకున్నాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూస్తే.. అతను ఉరి వేసుకుని కనిపించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీలక్ష్మి లాడ్జిలో విజయవాడకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి శనివారం సాయంత్రం దిగాడు. రిసెప్షన్‌లో పేరు, ఫోన్ నంబరు, ఊరి పేరు మాత్రమే చెప్పి రూమ్‌ తీసుకున్నాడు. రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన.. ఆదివారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో ద్వారకా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీఐ అప్పారావు, ఎస్ఏ స్వామినాయుడు సిబ్బందితో లాడ్జికి చేరుకున్నారు. వారు కూడా తలుపులు కొట్టి చూడగా.. ఓపెన్ కాలేదు. దీంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే సతీష్ కుమార్ కిటికీకి ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. అయితే అతని వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అప్పారావు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.