యాప్నగరం

బ్రేకింగ్: అరకులో బస్సు బోల్తా: నలుగురు మృతి.. అంతా హైదరాబాద్ వారే!

విశాఖపట్నం జిల్లా అరకు లోయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 13 Feb 2021, 12:27 pm
విశాఖపట్నం జిల్లా అరకులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్‌ రోడ్డు, అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్‌ మలుపు వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడిన బస్సు.. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా గాయాలయ్యాయి.
Samayam Telugu విశాఖ రోడ్డు ప్రమాదం


పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్‌ ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిని కే. సరిత, కే.సత్యనారాయణ, నిత్య, లతలుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
దాదాపు 30 మంది శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అరకు పర్యాటనకు వచ్చారు. అరకును సందర్శించి తిరిగి వెళ్తుండగా బస్సు లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.