యాప్నగరం

Visakhapatnam: కాలుష్య కోరల్లోకి విశాఖపట్నం.. 'సీపీసీబీ' నివేదికలో కీలక అంశాలు..!

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశాఖపట్నంపై కీలక చర్చ జరుగుతోంది. ఏపీ సర్కార్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని పదేపదే చెబుతోంది. ఈ సమయంలో.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కీలక విషయం వెల్లడించింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 9 Nov 2022, 10:11 am
Visakhapatnam: దేశంలో రోజురోజుకూ పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుతోంది. దీంతో చిన్న చిన్న నగరాలు కూడా కాలుష్య కోరల్లోకి వెళ్తున్నాయి. తాజాగా.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. 163 నగరాలకు సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ప్రమాణాల వివరాలను వెల్లడించింది. ఆ 163 నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్‌, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, అనంతపురం నగరాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది.
Samayam Telugu Visakhapatnam
విశాఖ నగరం


ముఖ్యంగా విశాఖపట్నం 202 పాయింట్లతో.. గాలి నాణ్యత మరీ తక్కువగా ఉన్న నగరంగా రికార్డులకెక్కింది.. అనంతపురం (145), హైదరాబాద్‌ (100), తిరుపతి (95) ఏలూరు (61) పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. తొలిసారిగా బిహార్‌లోని కటిహార్‌ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా మొదటిస్థానంలో నిలిచింది. 2.40 లక్షల జనాభా గల ఈ నగరంలో.. గాలి నాణ్యత 360 పాయింట్లకు పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఢిల్లీలో 354 పాయింట్లు, నోయిడా 328, ఘాజియాబాద్‌‌లో 304 పాయింట్లు ఉన్నట్టు కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.