యాప్నగరం

Vizag: అరకు మార్గంలో పట్టాలు తప్పిన రైలు

Visakhapatnam: విశాఖపట్నం - కిరండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అరకు లోయ మార్గంలో కాశీపట్నం సమీపంలోని శివలింగపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి ఎమర్జెన్సీ టీమ్ చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 17 Jan 2023, 2:14 pm
అరకు లోయ మార్గంలో ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం (జనవరి 17) ఉదయం కాశీపట్నం సమీపంలోని శివలింగపురం వద్ద పట్టాలు తప్పడంతో ఒక బోగీ పక్కకు ఒరిగింది. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
Samayam Telugu Visakhapatnam Kirandul train
పట్టాలు తప్పిన రైలు


ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే.. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులను మరో బోగీలో ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు.

ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతల సమయాల్లో కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగే ముప్పు ఉందని వివరించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.